బిగ్బాస్ ఏ ముహుర్తాన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ ఇచ్చాడో కానీ హౌస్ మొత్తం గందరగోళంగా మారింది. దెయ్యాలు రెచ్చిపోవడంతో.. మనుషులుగా ఉన్న శ్రీముఖి, మహేష్, పునర్నవిల మెడకు చుట్టుకుంది. ఆ టాస్క్లో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చినందుకు గానూ ఆ ముగ్గురికి పనిష్మెంట్ను బిగ్బాస్ ఇచ్చాడు. షూ పాలిష్ చేయాలంటూ ఇచ్చిన టాస్క్ను పునర్నవి, మహేష్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు షూ పాలిష్ చేయమంటాడు.. రేపు చెడ్డీలు ఉతకమంటాడు అంటూ మహేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. గతి లేక వచ్చామా అంటూ ఆ సమయంలో బాగానే ఫైర్ అయ్యాడు. అయితే ఇదే మహేష్ కొంపముచ్చేట్టుంది. ఈ విషయంలో నాగార్జున బాగానే సీరియస్ అయినట్టు కనిపిస్తోంది. స్టేజ్ పైనే షూ పాలిష్చేసిన నాగ్.. గేట్లు తెరిచే ఉన్నాయి బయటకు వెళ్లు అంటూ మహేష్కు వార్నింగ్ ఇచ్చాడు. మరి తరువాత ఏం జరిగిందన్నది తెలియాలంటే షో ప్రసారమయ్యే వరకు ఆగాలి.