ప్రేమకు చిహ్నం అయిన తాజ్మహల్. కాజల్ అగర్వాల్ ఇటీవల ఆగ్రాలోని తాజ్మహల్ను సందర్శించింది. తాజ్మహల్ అందాలను చాలా దగ్గరగా చూడడంతో పరమానందభరితమైపోయిందట. తాజ్ మహల్ అందాలను చూసి మైమరిచిపోయింది నటి కాజల్ అగర్వాల్.ఈ విషయాన్ని..అక్కడ తను తీసుకున్న ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. ‘తాజ్మహల్ను చూసి మైమరచిపోయాను. మైకం కమ్మినంత పని అయ్యింది. ఆ అద్భుతాన్ని తిలకించి భ్రమించిపోయాను. తాజ్మహాల్ వశీకరణ అందాల గురించి ఇది వరకే విన్నాను. ఇప్పుడు ఆ కట్టడాలను, లోపలి విషయాలు, సమాధి, దాని చరిత్ర నన్ను గతంలోకి తీసుకెళ్లాయి. ఇది నా జీవతంలో మరచిపోలేని అనుభవం’ అని కాజల్ పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.