జబర్దస్త్ కామెడీ షోలోకి హీరోలు, హీరోయిన్లు తమ సినిమాల ప్రమోషన్ కోసం వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వాల్మీకి చిత్ర ప్రమోషన్ కోసం ఆ సినిమా కథానాయకుడు వరుణ్ తేజ్, కథానాయిక మృణాళిని వచ్చారు. ఇక వారిపై జబర్దస్త్ కిట్స్ చేసే కమెడియన్లు వారిపై జోకులు, బిస్కెట్లు వేస్తూ నవ్వులు పూయించారు. వాల్మీకి చిత్రం విడుదలైన శుక్రవారం రోజే ఈ జబర్దస్త్ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది. అయితే ఇప్పటికే విడుదలైన ఈ ఎపిసోడ్ ప్రోమోలో కిరాక్ ఆర్పీ.. వరుణ్ తేజ్, నాయిక మృణాళినికి బిస్కెట్లు వేసి నవ్వులు పూయించారు. అయితే, ఆర్పీ ఉపయోగించిన పదాలే మరింత హాస్యాన్ని పండించాయి. ప్రతి ఎపిసోడ్లో నాగబాబు, రోజా, యాంకర్లపై బిస్కెట్లు వేసే ఆర్పీ.. తాజా ఎపిసోడ్లో మాత్రం వరుణ్, మృణాళినికి బిస్కెట్లు వేసి నవ్వించారు. మీరు నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతున్నాయంటూ ఆమెను నవ్వుల్లో ముంచారు. ఇక వరుణ్ తేజ్ పైనా భారీ బిస్కెట్ పంచ్ వేశారు. అమ్మాయిలకు నిద్రపట్టకుండా చేయడం నేరమే అయితే.. ఈ పాటికి మీరు తీహార్ జైల్లో తీవ్రవాదుల మధ్యలో ఉండాలని చెప్పాడు. దీంతో వరుణ్ తేజ్ నవ్వుతూ మురిసిపోయారు. నాగబాబు కూడా పెద్దగా నవ్వేశారు. వాల్మీకి పేరుపై వివాదం చెలరేగడంతో ఈ చిత్రం పేరును మార్చారు. చిత్రంలో వరుణ్ తేజ్ పేరునే ఈ చిత్రానికి పెట్టారు. గద్దలకొండ గణేష్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు.