గుంటూరు అమ్మాయి దూళిపాళ శోబిత నటిగా కంటే మోడల్ గానే పాపులర్ .. హీరోయిన్ ఇటు దక్షిణాదిలోనూ, అటు బాలీవుడ్ లోనూ నటిస్తున్నది… తెలుగులో అడవి శేష్ మూవీ క్షణంలో నటించింది… తాజాగా మలయాళం యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. కురుప్ పేరుతో రూపొందనున్న ఈ మూవీకి శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకుడు.. 1980లో కేరళ ప్రాంతాన్ని వణికించిన క్రిమినల్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా ఈ మూవీ ’ తెరకెక్కుతోంది. సుకుమార కురుప్ పాత్రలో దుల్కర్ నటించడమే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. రీసెంట్గా షూటింగ్ ప్రారంభం అయింది. శోభిత ఫస్ట్ టైమ్ దుల్కర్తో జతకడుతుంది. కాగా, మలయాళంలో ఆమెకిది రెండో సినిమా.. ఇంతకుముందు నివీన్ పౌలీతో నటించిన ‘మూతాన్’ రిలీజ్కు రెడీ అవుతుంది.