సైరా విడుదలకు ఇంకా పదిరోజుల వ్యవధి మాత్రమే ఉంది. సైరాకు ఉన్న డిమాండ్ రీత్యా ఈచిత్ర హక్కుల కొరకు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య తీవ్ర పోటీనెలకొంది. తెలుగురాష్ట్రాల్లో అతిపెద్ద మార్కెట్ అయిన నైజాం హక్కుల కొరకు ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు పోటీపడుతున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర నిజాం హక్కులు 35కోట్ల వరకు పలికాయని తెలుస్తుంది. కాగా సైరా మేకర్స్ 40కోట్లకు నైజాం హక్కులను విక్రయించాలనే ఆలోచనలో ఉన్నారని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా దాదాపు 250కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన సైరా పాన్ ఇండియా మూవీగా ఐదు భాషలలో విడుదల అవుతుంది. వివిధ పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులైన అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి వారు నటించడంతో సైరా పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ అయిన సైరా లో నయనతార, తమన్నా హీరోయిన్స్ గా ప్రాధాన్యం ఉన్నపాత్రలలో నటిస్తున్నారు. సైరా చిత్రానికి బాలీవుడ్ సంగీత దర్శకుడు అ