తమిళంలో భారీగా నిర్మిస్తున్న ఎనై నోకి పాయుమ్ తోట చిత్రాన్ని తెలుగులో తూటా పేరుతో అనువదిస్తున్నారు. హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్ కాగా, టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఫుల్ రొమాంటిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రూపొందుతున్నట్టు ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేసిన విజయభేరి వారి బ్యానర్ ఆధినేతలు జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి మీడియాకు చెప్పారు.