‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘యమగోల మళ్ళీ మొదలైంది’, ‘బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్’ లాంటి వినోదాత్మక చిత్రాలు పాటు నాగార్జు హీరోగా చేసి‘ఢమరుకం’ లాంటి సోషియో ఫాంటసీ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి తాజాగా దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘రాగల 24 గంటల్లో’ సినిమా టీజర్ ను ఈ నెల 25న, చిత్రాన్ని అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు.
సత్యదేవ్, ఇషా రెబ్బా హీరో, హీరోయిన్లుగా శ్రీ కార్తికేయ సెల్యులాయిడ్స్ సమర్పణలో శ్రీ నవ్హాస్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ కానూరు నిర్మించారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాత శ్రీనివాస్ కానూరు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన మోషన్ పోస్టర్ ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ పొందింది. స్క్రీన్ ప్లే బేస్ డ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. సినిమాలో నటీనటులందరూ అద్భుతంగా చేశారు. సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చుతుందని స్పష్టం చేసారు. ఈ నెల 25న టీజర్ విడుదల చేస్తాం. వచ్చే నెల 18న సినిమా విడుదల చేయాలనుకుంటున్నాం అని చెప్పారు.