క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాకేశ్ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్ దర్శకత్వంలో రాకేశ్ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్స్టోరీ 'ఎవ్వరికీ చెప్పొద్దు'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై దిల్రాజు తెలుగులో అక్టోబర్ 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా... హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ - `మా జోష్ సినిమాలో రాకేష్ నటించాడు. విదేశాల్లో చదువుకొని వచ్చిన తను యాక్టింగ్ను కెరీర్గా తీసుకుంటా అన్నప్పుడు వద్దని వారించా. కొన్ని రోజుల తర్వాత నేను హీరోగా, నిర్మాతగా సినిమా చేస్తున్నా అని చెప్పాడు. అంతా కొత్తవారైనా వారు పడిన కష్టం తెర మీద కనిపించింది. కేవలం రిలీజ్ డేట్ కోసమే 9 నెలలు వెయిట్ చేశారు. వాళ్ల హర్డ్ వర్క్ చూసి సంతోషంగా అనిపించింది. కథలో మంచి కంటెంట్తో పాటు హ్యూమర్ కూడా ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది` అన్నారు.