మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో నరేష్, జీవిత రాజశేఖర్ వర్గాల మధ్య జరుగుతున్న విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారినట్టే కనిపిస్తోంది. ఆదివారం సమావేశం నిర్వహించడానికి జీవిత కోర్టు అనుమతులు తెచ్చుకోగా, సమావేశం చెల్లదంటూ నరేష్ వర్గం సభ్యులందరికీ ఫోన్లలో మెసేజ్లు పంపడం, తీరా వచ్చిన కొందరిలో మాటల యుద్దం మీడియాకెక్కి టాలీవుడ్ పరువు బజారు పాలు చేసారన్న అపప్రద వినిపిస్తొంది. రోజుకో వివాదం పెరిగిపోతుండటమే కానీ ఎక్కడా శుభం కార్డు పడే దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. గతంలో ఇలాంటి గొ సందర్భం ఏదివచ్చినా, టాలీవుడ్లో ఏ కార్యక్రమమైనా చేపట్టాలన్నా, పంచాయితీలు చేయాలన్నా దర్శకరత్న దాసరి నారాయణరావు పెద్దతరహాగా వ్యవహరించి ఓవైపు అందరికీ సర్ధి చెప్పుతూ తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సరికదా దాసరి స్ధానంలోకి వచ్చి అంతా చక్కదిద్దాలంటూ మెగాస్టార్ చిరంజీవిని కొందరు కోరుతున్నారట. దీనిపై స్పందించిన చిరంజీవి చూద్దాం అని చెప్పాడంటూ ఫిలింనగర్లో వార్త వ్యాపిస్తోంది. ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగటం వాస్తవమైతే సంతోషమే. అయితే ఇటీవల కాలంలో తన సోదరుడునాగబాబు యూట్యూబ్ లో చేసిన కామెంట్లపైనా సర్ధి చెపుతాడా? చెడామడా వాయిస్తాడా? అన్న ప్రశ్నలు కొందరేస్తున్నారు. ఏంజరగనుందో చూడాలి మరి...