లిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా అభిమానులకు దివాళీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి అదిరిపోయే సర్ప్రైజ్ సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం కారణంగా ఈ సారి ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చి అందరి దృష్టినీ ఇటు వైపు మళ్లించనున్నారట. ఈ మేరకు అక్టోబర్ 27వ తేదీన 'అల.. వైకుంఠపురములో' టీజర్ రిలీజ్ చేయబోతున్నారట త్రివిక్రమ్. మాస్, క్లాస్ ఆడియన్స్ని ఒకేసారి కట్టి పడేసేలా ఈ టీజర్ కట్ చేశారట ఈ మాటల మాంత్రికుడు. ఇటీవలే ఈ సినిమాను జనవరి 12 న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అదే రోజు మహేష్ బాబు హీరోగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమా కూడా విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఇద్దరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. గీతా ఆర్ట్స్ బ్యానర్, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో రూపొందుతోంది 'అల.. వైకుంఠపురములో' మూవీ. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ గత చిత్రం డిసాస్టర్ కావడంతో ఈ సినిమా ఎలాగైనా హిట్ కావాలని అల్లు అర్జున్ అంచనాలు పెట్టుకున్నారు. ఆ కారణంగానే అటు త్రివిక్రమ్, ఇటు అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. చూడాలి మరి ఇప్పుడు దివాళీ ట్రీట్.. జనవరిలో సంక్రాంతి ట్రీట్ ఏ రేంజ్లో ఉంటుందనేది.