విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య మల్టీ స్టారర్ గా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "వెంకీమామ". పల్లెటూరు వాతావరణంతో పూర్తి వినోదభరితంగా నిర్మితమైన సినిమా ఇది. ఈ కారణంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే రీ సెంట్ గా మాత్రం ఈ విషయంలో ఎలాంటి హడావిడి కనిపించడం లేదు. దాంతో సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా .. రావడం లేదా? అనే సందేహం అభిమానుల్లో చోటుచేసుకుంది.
నిజానికి ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఉందట. ఆల్రెడీ పూర్తయి వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ సురేశ్ బాబుకి నచ్చకపోవడం వలన, పర్ఫెక్ట్ గా చేసి పంపించమని చెప్పేసి వెనక్కి పంపించేశారట. రెండు రోజుల్లో ఆ అవుట్ పుట్ రానుంది .. అది సురేశ్ బాబుకి నచ్చితే, దానిని బట్టి విడుదల తేదీని ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించిన సంగతి తెలిసిందే.