తన తదుపరి సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయాలనుకున్నాడు. అందుకు సంబంధించిన కథపైనే వంశీ పైడిపల్లి కసరత్తు చేస్తున్నాడు. అయితే ఈ కథ బౌండ్ స్క్రిప్ట్ రూపంలో చేతికి వచ్చి .. అన్నీ సెట్ చేసుకోవడానికి మరో నాలుగైదు నెలల సమయం పట్టొచ్చని వంశీ పైడిపల్లి చెప్పినట్టు సమాచారం. దాంతో ఈ గ్యాప్ లో ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతో మహేశ్ ఆయనకి కాల్ చేశాడనీ .. ఇటీవలే ఇద్దరి మధ్య చర్చలు జరిగిపోయాయని సమాచారం. సాధ్యమైనంత వరకూ ఈ ప్రాజెక్టే పట్టాలెక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.