ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సరిలేరు నీకెవ్వరు’ చివరి షెడ్యూల్ కి రంగం సిద్ధం

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 02:40 PM



అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో విలన్  ఇంటికి సంబంధించిన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్ చిత్రీకరణకి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ను పూర్తిచేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా  నటిస్తుంది. ఈ సినిమాలో  ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమె పవర్ఫుల్ రోల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com