అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో విలన్ ఇంటికి సంబంధించిన సన్నివేశాలను కొన్ని రోజులుగా చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఈ సన్నివేశాల చిత్రీకరణతో పాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. చివరి షెడ్యూల్ చిత్రీకరణకి ఈ సినిమా టీమ్ సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ షెడ్యూల్ ను పూర్తిచేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. చాలా కాలం తరువాత ఈ సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఆమె పవర్ఫుల్ రోల్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందట.