ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్ద ఎషియన్ సినిమా కార్యలయాలపై ఐటి దాడులు జరిగాయి. అలాగే ఎషియన్ సినిమా అధినేతలు నారయణదాస్, సునీల్ నారంగ్ ల ఇళ్లతో పాటు వారి సన్నహితుల నివాసాలల్లో కూడా ఐటి సోదాలు జరిగాయి. హీరో మహేష్ బాబుతో కలిసి ఎషియన్ సినిమా సంస్ద ఎ.ఎమ్.బి మాల్ ను ఏర్పాటు చెసిన సంగతి తెలిసిందే. కాగా నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు, ఎషియన్ సినిమాస్ పేరిట థియేటర్స్ నిర్మాణం కూడా ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మజిలీ లాంటి సూపర్ హిట్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగచైతన్య హీరోగా.. ఫిదాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్ గా పెట్టి సినిమా చేస్తోంది ఎషియన్ సినిమాస్.