సుందీప్ కిషన్ కామెడీ చిత్రం తెనాలి రామకృష్ణ బిఎ బిఎల్ తన సెన్సార్ కార్యకలాపాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం క్లీన్ అండ్ నీట్గా ఉందని, అయితే కొన్ని దృశ్యాలపై దృష్టి సారించిన సెన్సార్ బోర్డు యు / ఎ సర్టిఫికేట్ అందించింది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అన్ని అడ్డంకులను అధిగమించిఈ నెల 15 విడుదలవుతున్నట్టు నిర్మాతలు చెప్పారు. ఇటీవల విడుదలైన ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభింస్తుండటంతో థియేటర్ల వద్ద ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టిక్కెట్లు అమ్మకాలు జోరందుకున్నాయి. విడుదలకు ముందే ఈ చిత్రంపై భారీ అంచనాలుకలిగించేలా ట్రైలర్ ఉండటంతో ధియేటర్లలో జనం నవ్వుల వాన కురియనుంది.
ఈ చిత్రంలో వెన్నెలా కిషోర్, ప్రభాస్ సీను మరియు సప్తగిరి వంటి హాస్యనటులు చక్కిలిగింతలు చేస్తారని దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి చెప్పారు. సుందీప్ కిషన్ సరసన హన్సిక మోత్వానీ నటిస్తుండా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది.