భరత్ అనే నేను’ సినిమాతో స్టార్ హీరో మహేష్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది కిర్రాక్ పోరి కియారా అద్వానీ. ఆ సినిమా సెట్స్ పైకి రావడంతో రామ్ చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో జోడి కట్టింది.ఇక రామ్ చరణ్కి ‘వినయ విధేయ రామ’ ఎంత డ్యామేజ్ చేసిందో అందరికీ తెలిసిందే. కియారాకి మాత్రం టాలీవుడ్లో మళ్లీ ఎంట్రీ ఇవ్వకుండా చేసింది. ‘వినయ విధేయ రామ’ దెబ్బకి అల్లు అర్జున్ కూడా కియారాకు మొహం చాటేశాడు. లేదంటే త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ జోడి కియారానే నటించాల్సింది. ‘వినయ విధేయ రామ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా నిలబడంతో టాలీవుడ్ దర్శకులు కియారా వైపు చూడడమే మానేశారు. అదే సమయంలో బాలీవుడ్ మాత్రం కియారా అద్వానీకి రెడ్ కార్పెట్తో స్వాగతం పలికింది.