వివాహ బంధంతో ఒకటైన ప్రేమ జంట విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, కాజోల్.. ఇలా బీ-టౌన్కు చెందిన వారంతా నూతన దంపతుల్ని శుభాకాంక్షలతో ముంచెత్తారు. కానీ, ప్రముఖ నటి దీపికా పదుకొణె మాత్రం విష్ చేయలేదు. గతంలో అనుష్క, దీపిక మధ్య గొడవలు ఏర్పడ్డాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపిక శుభాకాంక్షలు తెలపలేదని చెప్పుకొచ్చారు.
అయితే దీపిక, ఆమె ప్రియుడిగా ప్రచారంలో ఉన్న హీరో రణ్వీర్ సింగ్ కలిసి అనుష్క ఇంటికి ప్రత్యేక బహుమతి పంపినట్లు సమాచారం. దీంతోపాటు అందమైన పుష్పగుచ్ఛాన్ని కూడా పంపారట. దానిపై అనుష్క, కోహ్లీలకు శుభాకాంక్షలు చెబుతూ.. రణ్వీర్, దీపికలు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. దీపిక ‘పద్మావతి’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. సంజయ్లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్పుత్ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్ర విడుదలను కర్ణిసేన కార్యకర్తలు, పలువురు భాజపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. సినిమాలో పద్మిని గురించి తప్పుగా చూపించారని, చరిత్రను వక్రీకరించారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు జరుగుతున్నట్లు సమాచారం.