ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసివెళ్లారు : బాలకృష్ణ

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2019, 12:39 PM



దిశా అత్యాచార నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. దిశా అత్యాచారం మరియు హత్యకేసులో నిందితులు ఈ రోజు తెల్లవారుఝమున పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయిన సంగతి తెలిసిందే కదా. దీనిపై దేశ వ్యాప్తంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటులు తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. ఈ రోజు బోయపాటి శ్రీను సినిమాను ఓపెనింగ్ సందర్భంగా ఎన్‌కౌంటర్ పై స్పందించారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు. అలాగే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసివెళ్లారని నమ్ముతున్నాను. ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి. ఈ నలుగురి ఎన్‌కౌంటర్‌తో ఒక ఆడబిడ్డకు న్యాయం జరిగిందన్నారు. అలాగే దిశ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలన్నారు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com