దిశా అత్యాచార నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. దిశా అత్యాచారం మరియు హత్యకేసులో నిందితులు ఈ రోజు తెల్లవారుఝమున పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే కదా. దీనిపై దేశ వ్యాప్తంగా సామాన్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్కు చెందిన పలువురు నటీనటులు తెలంగాణ పోలీసుల పనితీరును మెచ్చుకుంటున్నారు. ఈ రోజు బోయపాటి శ్రీను సినిమాను ఓపెనింగ్ సందర్భంగా ఎన్కౌంటర్ పై స్పందించారు. కాగల కార్యం గంధర్వులే తీరుస్తారని అంటారు. అలాగే ఈ రోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ భగవంతుడు పోలీసుల రూపంలో వచ్చి చేయవలసిన పనిని చేసివెళ్లారని నమ్ముతున్నాను. ఇది చూసైనా మళ్లీ ఎవరైనా ఇలాంటి పనులు చేయాలంటే భయపడాలి. ఈ నలుగురి ఎన్కౌంటర్తో ఒక ఆడబిడ్డకు న్యాయం జరిగిందన్నారు. అలాగే దిశ ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుంటున్నాను. ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేసిన తెలంగాణ ప్రభుత్వానికి మరియు తెలంగాణ పోలీసులకు నా కృతజ్ఞతలన్నారు.
దిశా ఎన్కౌంటర్ పై స్పందించిన నందమూరి బాలక్రిష్ణ pic.twitter.com/5yj5beaYoi
— Vamsi Shekar (@UrsVamsiShekar) December 6, 2019