సాహో రిజల్ట్ ప్రభాస్ ని ఆలోచనల్లో పడేసిందా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రం `జాన్` పై సాహో రిజల్ట్ ప్రభావం పడిందని కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. అది నిజమేనని తాజాగా అందిన సోర్స్ కన్ఫామ్ చేస్తోంది. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇప్పటికే 30రోజుల పాటు చిత్రీకరించారు. అయినా ఇప్పుడు ప్రభాస్ స్క్రిప్టు లో మార్పుల్ని సూచించడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రభాస్ ప్యారిస్ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ లో అడుగు పెట్టారు. స్టార్ నటుడు ప్రభాస్ యూరప్ టూర్ నుంచి తిరిగి వచ్చాక అసలు జాన్ చిత్ర విషయమే పట్టనట్లు వ్యవరిస్తున్నాడట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..సాహో సినిమా సెట్స్ ఫై ఉండగానే రాధా కృష్ణ డైరెక్షన్లో జాన్ (వర్కింగ్ టైటిల్ ) ను మొదలు పెట్టారు, పూజా హగ్దే హీరోయిన్ గా యూవీ , గోపికృష్ణ బ్యానర్ లపై తెరకెక్కుతుంది. మొదటి షెడ్యూల్ ను విజయవంతం గా యూరప్ లో పూర్తి చేసారు. కానీ ఆ తర్వాత షెడ్యూల్ ను మాత్రం మొదలుపెట్టలేదు. దీనిపై ప్రభాస్ కానీ, ఇటు యువి కానీ దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. అన్నపూర్ణ సెట్, రామోజీ ఫిలిం సిటీ లో సెట్ రెడీ గా వుంది. కానీ షూటింగ్ మాత్రం ప్రారంభం కావడం లేదు. నవంబర్ నుంచి మలి షెడ్యూలు మొదలవుతుంది అనుకున్నారు కానీ అలా జరగలేదు. డిసెంబర్ నుంచి అనుకున్నారు కానీ ఇప్పటికి ఆ సూచనలు కనిపించడం లేదు. ప్రభాస్ కూడా మళ్లీ మరోసారి విదేశాలకు వెళ్లారు. దీంతో ఫిలిం సర్కిల్లో పలు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ఫై ప్రభాస్ కు ఇంట్రస్ట్ లేదని..అందుకే వీరే కథ ను సెట్ చేసుకొనే పని లో ఉన్నాడని..సూరి కథ వైపు ప్రభాస్ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగా ప్రభాస్ కు ఇంట్రస్ట్ తగ్గిందనేది తెలియాల్సి ఉంది.