తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండ అదిరిపోయే హిట్ అందుకుని ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత వెంటనే సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత వచ్చిన ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో అదిరిపోయే ఆదరణ పొందాడు. కాగా ఇటీవల వచ్చిన 'డియర్ కామ్రెడ్' సినిమా కొంత నిరాశ పరిచింది. అది అలా ఉంటే.. తాజాగా విజయ్ దేవరకొండ ఓ ఇంటివాడయ్యాడు. మొన్నటి వరకు శ్రీనగర్ కాలనీలో ఉంటున్న విజయ్ ఫ్యామిలీ.. ఇటీవలే ఫిల్మ్ నగర్లోని నటుడు శ్రీకాంత్ ఇంటికి సమీపంలో ఉన్న కొత్త ఇంటికి మారారు. ఈ కొత్త ఇంటిని విజయ్ దాదాపు రూ.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండ.. తన తల్లితండ్రులు, సోదరులతో కలిసి కలిసి ఈ ఇంట్లో శాస్త్రోక్తంగా గృహ ప్రవేశం చేసాడు. ఈ కొత్త ఇంటికి గీతా గోవిందం నటి రష్మిక మందన వచ్చారు. ఆమెతో పాటు దర్శకుడు వంశీ తన కుటుంబంతో హాజరైయ్యారు. ఈ సందర్బంగా ఓ ఫోటో దిగారు. ఆ ఫోటోలో విజయ్ తమ్ముడు ఆనంద్ కూడా ఉన్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.