సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ రివైజింగ్ కమిటీ తీర్మానం చేసింది. కొన్ని కట్స్ ఇచ్చి ఈ సినిమాను విడుదల చేసుకోండి అంటూ వర్మకు ఊరటనిచ్చింది రివైజింగ్ కమిటీ. ఈ సినిమాకు కమ్మరాజ్యంలో అని కాకుండా టైటిల్ మార్చేసాడు దర్శకుడు వర్మ. దీనికి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ మార్చేసాడు ఆర్జీవీ. యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చి ఈ చిత్రాన్ని విడుదల చేసుకోమ్మని వర్మకు చెప్పడంతో అభిమానులు కూడా ఆసక్తిగా సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు.