ప్రపంచ సంగీత ప్రియులను ఉర్రూతలూగించింది నటులు ధనుష్-సాయి పల్లవిల 'మారి-2' చిత్రంలోని 'రౌడీ బేబీ' పాట. యూట్యూబ్ వ్యూస్ లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటి వరకూ 'రౌడీ బేబీ' పాట 725 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ రికార్డుల్లో ఏడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ పాట ధనుష్ స్వయంగా రాసి..పాడాడు. కాగా ఈ పాటకు స్వరకర్త యువన్ శంకర్ రాజా. ఈ సాంగ్ కి అదిరి పోయే స్టెప్పులను అందించారు ప్రముఖ కొరియో గ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా. అయితే 'రౌడీ బేబీ' వీడియో సాంగ్ టాప్ 7లో నిలిచి రికార్డులను సృష్టించిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం.