సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నో వివాదాలకు కారణమైన ఈ సినిమా ప్రస్తుతం సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తాజాగా ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాకు లైన్ క్లియర్ అయింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ''మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికీ ఉందని అర్థమైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది'' అని ట్వీట్ చేశాడు. వెంటనే మరో ట్వీట్లో ''సారీ సారీ సారీ.. అలవాటులో పొరపాటు.. నా ఉద్దేశ్యం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'' అని వర్మ పేర్కొన్నాడు.
Sorry sorry sorry ..Alavaatlo porapatu..I mean AMMA RAJYAMLO KADAPA BIDDALU pic.twitter.com/g2UoG1DDso
— Ram Gopal Varma (@RGVzoomin) December 7, 2019