మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మైండ్ బ్లాక్ పాటను విడుదల చేసారు. పక్కా మాస్ బీట్తో సాగిపోయే ఈ పాట మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా బడ్జెట్ గురించి కొన్ని వివరాలు తాజగా బయటకు వచ్చాయి. ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడికి రూ.8 కోట్లు పారితోషికం ముట్టిందట. మహేష్ బాబు ఇతర నటీనటుల రెమ్యూనరేషన్లన్నీ కలిపితే రూ.60 కోట్లు అయిందట. సినిమాకు ప్రొడక్షన్ కాస్ట్ రూ. 32 కోట్లు. మొత్తం కలిపి ఈ సినిమా బడ్జెట్ రూ.100 కోట్ల మార్క్ టచ్ అయినట్టు తెలుస్తోంది. అలాగే ఇటీవల విడుదల అయిన టీజర్, ఫస్ట్ సాంగ్ సినిమాపై అటు ప్రేక్షకులలో, ఇటు మహేష్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. కాగా, ప్రతి సోమవారం ఈ సినిమా నుండి ఒక పాటను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.