సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి చిన్న కుమారుడు శ్రీ సింహా హీరోగా అరంగేట్రం చేస్తున్న మూవీ మత్తు వదలరా..రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాలనటుడు శ్రీ సింహనే. తరువాత మర్యాదరామన్న, బాహుబలి ది బిగినింగ్ చిత్రాల్లోనూ నటించాడు ఈ యువ నటుడు. తరువాత నటనకు బ్రేక్ ఇచ్చి కొంతకాలం దర్శకత్వం శాఖలో పనిచేశాడు. తాజాగా హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. . కొత్త దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ ఈ మూవీ సంగీత దర్శకుడు. నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, సత్య, బ్రహ్మజీ ఇతర పాత్రలలో నటిస్తున్నారు.. తాజాగా ఈ మూవీ టీజర్ ను మెగా పవర్ స్టార్ విడుదల చేశారు.. టీజర్ చూస్తుంటూ ఈ మూవీలో వినూత్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది..