ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ పాత్రకు న్యాయం చేయలేనేమో అన్న భయంతో నో చెప్పా: రష్మిక

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 07, 2019, 06:39 PM



'ఛలో' మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్న తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో సెన్సేషన్ హీరో విజయదేవరకొండ నటించిన 'గీతాగోవిందం' మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరింది. దాంతో రష్మిక మందనకు వరుస అవకాశలు వచ్చాయి. విజయ్ దేవరకొండతో 'డీయర్ కామ్రెడ్'లో నటించింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సరసన 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో నటిస్తుంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్నసినిమా, నితిన్ భీష్మలో నటిస్తుంది రష్మిక. 'డీయర్ కామ్రెడ్' ఫెయిల్యూర్ తర్వాత తాజాగా ఈ భామ తన సినిమాల ఎంపిక విషయంలో తొందర పడకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అంతే కాదు గత మూడు సంవత్సరాలుగా విశ్రాంతి తీసుకోకుండా పని చేస్తూనే ఉన్న రష్మిక బాగా అలసి పోయిందట. అందుకే రెండు నెలల గ్యాప్ లోనే నాలుగు సార్లు అస్వస్థతకు గురైనట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. తెలుగులో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న 'జెర్సీ' సినిమాను హిందీలో రీమేక్ చేస్తు్న్న సంగతి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందనను ఎంపిక చేసుకోవాలనుకుంది చిత్రబృందం. కానీ ఆ మూవీని సున్నితంగా తీరస్కరించినట్లు సమాచారం. అయితే దీనికి గల కారణం సినిమాకు గాను ఎక్కువ పారితోషికం అడగటమేనని వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై స్పందించిన రష్మిక మందన బాలీవుడ్ లో వస్తున్న 'జెర్సీ' సినిమాలో తన పాత్రకు న్యాయం చేయలేనేమో అన్న భయంతో ఈ సినిమాకు నో చెప్పనని, నేను ఓ సినిమాలో నటిస్తున్నానంటే దానికి సంపూర్ణ న్యాయం చేయగలను అన్నపుడే నటిస్తానని అంటుంది. సినిమాకి డబ్బు ముఖ్యం కాదు. ఎంత కష్టపడుతున్నాం అన్నది ముఖ్యం అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com