మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ప్రతీ ఒక్కటి ప్లాన్ చేసుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మైండ్ బ్లాక్ పాటను విడుదల చేసారు. పక్కా మాస్ బీట్తో సాగిపోయే ఈ పాట మహేష్ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఈ చిత్రం సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. ఈలోగా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు నటుడు రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని తాజా సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు..రష్మిక మందన జంటగా నటిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి ఓ కీలక పాత్రలో మెరవనున్నారు.