ఈ మధ్యకాలంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’కి వచ్చినంత హైప్ మరే చిత్రానికి వచ్చి ఉండదు. ‘బాహుబలి’ లాంటి ఆల్ ఇండియా హిట్ మూవీ తరువాత ఈ స్టార్ హీరో నుండి వస్తున్న చిత్రం కావడం, భారీ బడ్జెట్తో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. అయితే ‘సాహో’ అన్ని భాషల్లో కలిపి 400కు పైగా పైగా వరల్డ్వైడ్ కలెక్షన్స్తో ఈ ఏడాది హయస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ మూవీ చిత్రీకరణ 30, -40 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. ఈ మధ్యనే హీరోయిన్ పూజా హెగ్డే సినిమా షూటింగ్లో చేరారు. కాగా ‘జాన్’ మూవీ బడ్జెట్ కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ చిత్రం కోసం 180 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నారని తెలిసింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన నేపథ్యంలో ఈ మాత్రం బడ్జెట్ రికవర్ చేయడం అంత కష్టమైన పనేమీ కాదని నిర్మాతలు భావిస్తున్నారట. ‘సాహో’ నిర్మాతలైన యువి క్రియేషన్స్ వారే ‘జాన్’ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.