తన సినిమాను గుర్తు తెలియని వ్యక్తులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి 40 లక్షల మేర నష్టాన్ని కలిగించారని ఆవేదన వ్యక్తం చేస్తూ దుర్గాప్రసాద్ అనే యువకుడు హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ వద్ద పురుగుల మందు తాగి హల్ చల్ చేశాడు. నానిగాడు పేరుతో నిర్మించిన సినిమా కు అన్యాయం జరిగిందంటూ ఆ చిత్రంలో నటించిన దుర్గాప్రసాద్ ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకొని పురుగుల మందు తాగాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.