బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అందజేసే క్రిస్టల్ అవార్డ్కు ఎంపికైంది. మానసిక రుగ్మతల నివావరణకు తన వంతు ప్రచారం నిర్వహిస్తున్న దీపికా కృషిని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ గుర్తించింది. మానసిక కుంగుబాటుతో కొన్నేళ్ల పాటు బాధపడిన దీపికా పదుకొనే 2015లో ద లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా అనేక ప్రచార కార్యక్రమాలు, చర్చా వేదికలను దేశవ్యాప్తంగా నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టల్ పురస్కారం పొందిన నలుగురిలో దీపిక ఒకరు కావడం విశేషం. ఈ అవార్డ్ దక్కడంపై దీపిక సంతోషం వ్యక్తం చేసింది.