పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. కేవలం 20రోజుల్లో షూటింగ్ పూర్తి చేసేలా వుండే కథను ను ఎంచుకున్నారు. ఎట్టకేలకు పవన్ రీ ఎంట్రీ పై క్లారిటీ దొరికింది. ఆయన పింక్ మూవీ రీమేక్ చేయనున్నట్లు స్పష్టమైన ప్రకటన రావడం జరిగింది. గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ హిందీ హిట్ మూవీ రీమేక్ తో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పింక్' సినిమాను తెలుగులో నటుడు పవన్ కల్యాణ్ తో రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ప్రయత్నిస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా వున్న పవన్ ను త్రివిక్రమ్ ద్వారా 'దిల్' రాజు ఒప్పించాడు. ఈ సినిమాకి ఆయన పవన్ కి రూ. 50 కోట్ల పారితోషికాన్ని ఇవ్వనున్నట్టు సమాచారం. ఆయన పారితోషికం పోగా మిగతా 20 కోట్లతో రెండు నెలలలో సినిమాను పూర్తి చేసే ఆలోచనలో 'దిల్' రాజు ఉన్నాడట. పవన్ తో సినిమా తీయాలనే బలమైన కోరిక కారణంగానే 'దిల్' రాజు ఈ ప్రాజెక్టుపై రూ. 70 కోట్లు పెడుతున్నాడట.