ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మే నెలలో పవన్ మూవీ విడుదలకు సన్నాహాలు!

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 18, 2020, 06:42 PM



పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇవ్వనున్న ‘పింక్’ తెలుగు రీమేక్  ఒరిజినల్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉంటుందట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు చాలానే మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నందున ఒక సామాజిక సందేశం ఉన్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పవన్ ఈ చిత్రాన్ని ఎంచుకున్నారు.  ‘పింక్’ తెలుగు రీమేక్ షూటింగ్ ఈ నెల 20 నుండి మొదలుకానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్లో మొదట పవన్ మీద ఒక ఫైట్‌ను చిత్రీకరిస్తారట.  ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. తమన్ సంగీతం అందించనున్నాడు. అయితే రంజాన్ సందర్భంగా, సమ్మర్ స్పెషల్ గా మే 23న పింక్ రీమేక్ ను విడుదల చేయడానికి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ చిత్రానికి కేవలం 20 రోజుల్ని మాత్రమే పవన్ కేటాయించినట్టు చెబుతున్నారు. కాగా,ఈ సినిమాలో పవన్ సరసన పూజా హేగ్దేని ఫిక్స్ చేశారట.. ఇక ఈ సినిమాతో పాటు పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే కథ చర్చలు కూడా అయిపోయాయని టాక్ వినిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com