'అరవింద సమేత' యావరేజ్ అయినా.. 'వాల్మికీ'లో పూజ హెగ్డే ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ కావడం, 'అల వైకుంఠపురముతో మళ్ళీ బ్లాక్ కస్టర్ కొట్టడంతో పూజ హెగ్డే క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది. మోహింజదారో తర్వాత పూజ హేగ్డ్ కి అవకాశాలు ఇవ్వాలంటే భయపడిన బాలీవుడ్ దర్శకనిర్మతలు.. ఇపుడుగా ఆమె లక్కుని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. హౌస్ ఫుల్ 4 తరవాత పూజ హేగ్డ్ కి మరోసారి అక్షయ్ కుమార్ తన కొత్త సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఇచ్చాడనే టాక్ అందుతుంది. మరి ప్రస్తుతం బాలీవుడ్ లో వరస విజయలమీదున్న ఏకైక హీరో అక్షయ్ కుమార్. అలాంటి అక్షయ్ మళ్ళీ పిలిచి అవకాశం ఇవ్వడంతో పూజ హెగ్డే నక్కని తొక్కిందంటున్నారు. మొదటి హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఈ పూజ హెగ్డే నటించబోతున్నట్లుగా తెలుస్తోంది.