మెహ్రీన్ నిర్మాతలను ముప్పుతిప్పలు పెడుతుందనే న్యూస్ ఇప్పుడు ఫిలిం సర్కిల్ లో హాట్ టాపిక్ గా మరింది. 'ఎంతమంచి వాడవురా' సినిమా నిర్మాతలను మెహ్రీన్ బాగా ఇబ్బంది పెట్టింది అని.. నిర్మాతల నుండి ఎంతగా రాబట్టలో అంతగా రాబట్టింది అని.. అంతేకాకుండా పర్సనల్ విషయాల కోసం కూడా నిర్మాతలను ముప్పుతిప్పలు పెట్టిందని టాక్ నడుస్తోంది. హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఇంత ఫిక్స్ చేసినా.. షూటింగ్ సమయంలో హీరోయిన్స్ పర్సనల్ ఖర్చులు కూడా నిర్మాతల అకౌంట్ లోనే పడుతుంది. అదే అదనుగా మెహ్రీన్ కౌర్ హోటల్ లో ఫుడ్ దగ్గరనుండి.. లాండ్రీ ఖర్చు, తనతో వచ్చిన పేరెంట్స్ ఖర్చులను కూడా నిర్మాతలకు బిల్లులు పంపి లక్షలు గుంజింది అనే న్యూస్ నడుస్తుంది. ఆ విషయంలో ఎంతమంచి వాడవురా నిర్మాతకి మెహ్రీన్ కి మధ్యలో చిన్న గొడవ కూడా జరిగినట్టుగా ప్రచారం జరుగుతుంది.