కీర్తి సురేష్ బాలీవుడ్ మైదాన్ సినిమా నుండి తప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సయ్యద్ రహీం అనే ఫుడ్ బాల్ ఆటగాడి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మైదాన్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన కీర్తి సురేష్ నటిస్తుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే నిర్మాత బోని కపూర్ తో కీర్తి సురేష్ మాట్లాడి ఈ సినిమా నుండి బయటికొచ్చేసిందంటున్నారు. అజయ్ దేవగన్ భార్య పాత్రలో కీర్తి చాలా తక్కువ వయసు గా ఉన్న అమ్మాయిగా కనబడంతో.. కీర్తి సురేష్ కి అంతగా నచ్చకపోవడంతో.. ఈ సినిమా నుండి తానే తప్పుకుంటున్నట్లుగా బోణీ కపూర్ కి చెప్పినట్టుగా బాలీవుడ్ మీడియా టాక్.