ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్స్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్దం మూవీ.. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. ఇటీవలే షూటింగ్ ఫినిష్ కావడంతో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు మేకర్స్. త్వర త్వరగా ఈ కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 31న 'నిశ్శబ్దం' సినిమా విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతోందట. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేసే అవకాశాలున్నాయని టాక్ నడుస్తోంది. చూడాలి మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో!.