రష్మిక మందనకు ఐటీ అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలసిందే. ఆమె సొంతూరు కర్ణాటకలోని కూర్గ్లో ఉన్న ఇంట్లో సంక్రాంతి పండుగ రోజు ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహించారు. అందులో భాగంగా రష్మిక నివాసం నుంచి ఐటీ అధికారులు రూ.25 లక్షల విలువజేసే ఆస్తి పత్రాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం కర్ణాటకలోని కొడుగు జిల్లా విరాజ్పేటలోగల ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేసారు. ఈ క్రమంలో లెక్క తేలని మొత్తం రూ.25 లక్షలు విలువజేసే ఆస్తి పత్రాలు, నగదును ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్వాధీనం చేసుకున్న ఈ మొత్తానికి సంబంధించిన పూర్తి వివరాలను రష్మిక తండ్రి ఐటీ అధికారులకు చూపించలేకపోయారు. దీంతో దాదాపు రూ.25 లక్షల విలువజేసే ఆస్తి పత్రాలు, డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అందులో భాగంగా రష్మిక మందనకు ఆదాయ పన్నుల శాఖ నోటీసులు పంపింది. ఈ నెల 21న బెంగళూరు, మైసూరు కార్యాలయాల్లో హాజరై స్వాధీనం చేసుకున్న మొత్తానికి వివరాలు అందించాలని రష్మికకు నోటీసులు జారీ చేశారు అధికారులు. అది అలా ఉంటే రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.