తాప్సి 'ఝుమ్మంది నాదం' చిత్రం తో తెలుగు తెరకు పరిచమైంది. తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీ నటిగా మారింది. ఇప్పుడు విలన్ రోల్ చేసేందుకు సిద్ధమైనట్లు బి టౌన్ లో వార్తలు వినిపిస్తున్నాయి. తాప్సీ ప్రధాన పాత్రలో 'హసీనా దుల్రుబా' పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్నది. వినిల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాప్సీ నెగెటివ్ షేడ్స్తో కూడిన పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. సీరియల్ కిల్లర్గా ఆమె కనిపించనున్నట్లు చెబుతున్నారు. మరి ఇది నిజామా కదా అనేది తాప్సినే క్లారిటీ ఇవ్వాలి.