ప్రపంచంలో సుప్రసిద్ధ సంస్థలకు వినియోగదారులతో అనుసంధానించబడేందుకు సాధికారిత కల్పిస్తున్న సాఫ్ట్ వేర్ కంపెనీ పెగా సిస్టమ్స్, ఐఎన్సీ (నాస్ డాక్: పెగా) మరియు ప్రాధమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆంగ్ల భాష విద్యలో శిక్షణ అందించడంతో పాటుగా నాయకత్వ నైపుణ్యం, డిజిటల్ అక్షరాస్యతలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థ నేడు సుప్రసిద్ధ నటి, నిర్మాత మరియు టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ లక్ష్మి మంచును ఒక రోజు పాటు ఆంగ్ల భాషా ఉపాధ్యాయురాలిగా సేవలనందించేందుకు ఆహ్వానించింది. మాదాపూర్ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించడంతో పాటుగా నూతన విద్యా సంవత్సరంలో పెగా టీచ్ ఫర్ ఛేంజ్ అక్షరాస్యత కార్యక్రమం కోసం వాలెంటీర్ అప్లికేషన్ లను ఆహ్వానించారు. ఆ సంస్థ ఆహ్వానం మేరకు మంచు లక్ష్మి ఆదివారం మాదాపూరులోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషను బోధించారు. ఈ టీచ్ ఫర్ ఛేంజ్ సంస్థకు గౌరవ ఛైర్మన్గా కూడా మంచు లక్ష్మి వ్యవహరిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల నడుమ అక్షరాస్యత నైపుణ్యం అభివృద్ధి చేయడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అక్షరాస్యతను మెరుగుపరిచేందుకు దేశవ్వాప్తంగా టీచ్ ఫర్ ఛేంజ్ పాడు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యం చేసుకుని పనిచేస్తున్న ఈ కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో అక్షరాస్యతను వృద్ధి చేస్తుంది.