‘దొరసాని’ చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చింది నటుడు రాజశేఖర్ చిన్న కుమారై శివాత్మిక. ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించిన ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. నటుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి ఆమె ఈ చిత్రంలో నటించింది. ‘దొరసాని’ చిత్రంలో ఆమె నటనకుగానూ మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడామె రెండో చిత్రానికి రెడీ అవుతోంది. ఆమె నటించనున్న రెండో చిత్రాన్ని దుర్గా నరేష్ గుట్టా డైరెక్ట్ చేయనున్నాడు. ఇందులో ఆమె మోడ్రన్ గాళ్గా యంగ్ హీరో అరుణ్ ఆదిత్తో రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రాన్ని ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై శివ దినేష్ రాహుల్, అయ్యర్ నకరకంటి ఈ చిత్రానికి నిర్మాతలు. సీనియర్ నటి ఇంద్రజ ఓ ప్రముఖ పాత్రలో నటించనుంది. అరుణ్ ఆదిత్, శివాత్మిక రాజశేఖర్, ఇంద్రజ, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ, సత్య, అజయ్ ఘోష్, అజయ్, జయప్రకాష్ తదితరులు నటిస్తున్నారు.