నటుడు వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేయనున్నాడు. కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే నెల 17వ తేదీ నుంచి వైజాగ్ లో రెగ్యులర్ షూటింగు జరగనుంది. అల్లు బాబీ – సిద్ధూ నిర్మిస్తున్న ఈ సినిమాకి, హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కనిపించనున్నాడు. కొన్ని నెలలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకుని మరీ ఈ సినిమా షూటింగులో వరుణ్ తేజ్ పాల్గొననున్నాడు.