టాలీవుడ్లో బెజవాడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్ ఆ తరువాత రామ్ చరణ్ నాయక్ సినిమాతో మంచి విజయం అందుకుంది. అనంతరం అల్లు అర్జున్ హీరోగా చేసిన ఇద్దరమ్మాయిలతో సినిమాతో ఈమె స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే, ఆ తరువాత అవకాశాలు మాత్రం దక్కలేదు. తమిళ్, మలయాళంలో మాత్రం వరసగా సినిమాలు చేస్తూ జోష్ పెంచింది. ఇక ఇదిలా ఉంటె, దర్శకుడిని వివాహం చేసుకొని ఆ తరువాత విడిపోయి మరలా ఆమె సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
బోల్డ్ నటించి మెప్పించిన అమలా పాల్ ఇంట ఇప్పుడు విషాదం నెలకొన్నది. అమలా పాల్ తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా మరణించారు. గత కొంతకాలంగా అయన అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, హఠాత్తుగా మరణించడంతో చెన్నై సినిమా బిజీలో ఉన్న అమలా పాల్ హుటాహుటిన చెన్నై నుంచి కేరళ వెళ్ళింది. కేరళలో ఈరోజు పాల్ వర్గీస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి.