కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రగ్య జైస్వాల్ క్రేజ్ ఆఫర్ దక్కించుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అటూ రాజకీయాల్లో బీజీగా 2020లో రెండు సినిమాలను చేసేందుకు డేట్స్ ఇచ్చారు. పవన్ రీ ఎంట్రీ మూవీ పింక్.. తెలుగు వర్షన్కి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి లాయర్ సాబ్ పేరు పరిశీలనలో ఉంది. మరో మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారని సమాచారం.