ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇటలీలో సాంగ్ షూటింగ్ లో మాళవిక శర్మతో రామ్ !

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 16, 2020, 01:26 PM



‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేస్తున్న చిత్రం ‘రెడ్’. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఇటలీలో రెండు పాటలను చిత్రీకరణ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఇటలీలోని టస్క్, ఫ్లారెన్స్, డోలో మైట్స్ లాంటి ప్రాంతాల్లో రామ్, మాళవిక శర్మ ల పై రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 20వరకు అక్కడే చిత్రీకరణ జరుగుతుందట. ఈ సాంగ్స్ కు శోభి మాస్టర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. కాగా ఈ పాటలతో పాటు మరో పాట కూడా షూటింగ్ పూర్తి చేసుకుంటే.. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తైనట్లే. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ , మాళవిక శర్మ , అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com