కరోనా వైరస్ కారణంగా ఇటలీలోనే చిక్కుకుపోయానని, భారత్ కు రావాలని ఉన్నప్పటికీ రాలేని పరిస్థితి అని హిందీ, తెలుగు సహా పలు భారతీయ భాషల్లో పాటలు పాడిన సింగర్ శ్వేతా పండిట్ చెబుతోంది. ప్రస్తుతం ఇటలీలో ఉన్న శ్వేతా పండిట్ కొన్ని రోజులుగా స్వీయ నిర్భంధంలో ఉండిపోయానని, ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితి చూస్తుంటే తనకు చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటలీలో ఉన్న తాను ప్రతిరోజూ అంబులెన్స్ ల సైరన్లతోనే తనకు మెలకువ వస్తోందంటూ అక్కడి పరిస్థితి ఎలా ఉందో గుర్తుచేసింది. ఈ మహమ్మారి గురించి ఇటలీ వాసులు కళ్లు తెరిచేలోపే విజృంభించేసిందని అన్నారు. అసలు అయితే, హొలీ పండగకు మన దేశంలోనే ఉందామనుకున్నాను కానీ, ఈ లోపే పరిస్థితులు మారిపోయాయని, ఇలాంటి పరిస్థితిలో మన దేశానికి తిరిగి రావడం తనకు ఇష్టం లేకనే ఒంటరిగా ఉండిపోయానని చెప్పిన శ్వేతా పండిట్, ‘కరోనా’ నియంత్రణకు పాటించాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గుర్తుచేసింది.