తన పుట్టినరోజున అభిమానులు.. ఎక్కడ బయటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండి కరోనా మహామ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. రెండు రోజుల క్రితం చర్రీ ట్విట్టర్ ఖాతాను ప్రారంభించగా, గత అర్ధరాత్రి నుంచి అది ఫ్యాన్స్ విషెస్ తో నిండిపోయింది. వేలాది మంది అభిమానులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఫ్యాన్స్ తనపై చూపుతున్న అభిమానంపై స్పందించిన రామ్ చరణ్, "మీరు అర్ధరాత్రి నుంచి మనస్ఫూర్తిగా అందిస్తున్న అభినందనలతో ఎంతో ఆనందంగా ఉంది. దీంతో పాటు, మీరు నాకు ఇంకో బహుమతి ఇవ్వాలి. మీరు అందరూ అది నాకివ్వాలి. లాక్ డౌన్ ముగిసేంత వరకూ దయచేసి అందరూ ఇళ్లల్లోనే ఉండండి. ఇదే మీరు నాకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి" అని అన్నారు