ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీర్తి సురేష్ ప్లేస్ లో కియారా అద్వానీ

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 01, 2020, 12:07 PM



సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి సీజన్ వచ్చి మంచి కమర్షియల్ హిట్ ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి తో సూపర్ స్టార్ సినిమా సెట్స్ మీదకి వెళుతుందనుకున్నారు. కాని వంశీ పైడిపల్లి చెప్పిన కథ సూపర్ స్టార్ ని మెప్పించలేక మొత్తానికే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత మహేష్ పరుశురాం ను ఓకె చేసాడు . మహేష్ బాబు పరశురామ్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ని అధికారకంగా త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించబోతున్నారు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. మహానటి, అజ్ఞాతవాసి సినిమాల తర్వాత కీర్తి సురేష్ మళ్ళీ తెలుగు సినిమా లో కనిపించలేదు. . ఇక తాజాగా మహేష్ తో రూపొందబోయో సినిమాకి కీర్తి సురేష్ అయితే బాగుంటుందని పరుశురామ్ భావిస్తున్నాడట.అయితే ఇదేదీ అధికారికం కాదు. ఈలోగానే కియారా అద్వాణీ పేరు కూడా తెరపైకి వచ్చింది.`భరత్ అనే నేను` చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియరా అటుపై వినయ విధేయ రామ ఫ్లాపవ్వడంతో అటుపై టాలీవుడ్ వైపు చూడనే లేదు. కాగా మరోసారి మహేష్ తన సరసన కియారాకి ఛాన్సిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎంబీ 27 కోసం పరశురామ్ కి కియరాను రికమండ్ చేసినట్లు ఓ ప్రచారం సాగుతోంది.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com