కరోనా నిర్మూలన కోసం సినీ ప్రముఖులు ఎందరో తమవంతు విరాళాలను అందజేస్తున్నారు. అయితే కొందరు మాత్రం విరాళాలను ప్రకటించలేదు. దీంతో వారిపై నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా ఇప్పటివరకు ఎలాంటి అందజేయడం లేదంటూ నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా సోనాక్షి స్పందించింది. కొందరు సహాయం చేసి పబ్లిసిటీ చేసుకుంటాయని.. మరికొందరు సహాయం చేస్తే వారికి తప్ప వేరే వ్యక్తికి తెలియదని.. నేను రెండవ రకం అని తెలిపారు. నేను సహాయం చేసినట్లు ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదని.. ఇలా నన్ను ట్రోల్ చేసే వారి కోసం నేను ఒక నిమిషం మౌనం పాటిస్తాను. ఇలాంటి క్లిష్ట సమయంలో ట్రోల్స్ చేయడం కంటే ఈ విలువైన సమయాన్ని మంచి కోసం ఉపయోగించండి. విరాళం ప్రకటించడం అనేది నా వ్యక్తిగత విషయం అంటూ తన ట్వీట్లో చెప్పుకొచ్చింది సోనాక్షి.