పూజా హెగ్డే.. నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలుల అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్లో ఒకరుగా ఉన్నారు. ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్తో 'అరవింద సమేత'లో క్యూట్గా మైమరిపించింది. తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకుంది. తాజాగా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి అదిరిపోయే హిట్ అందుకుంది. అది అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. అందులో భాగంగా కొందరు ఇంటి పనులలో బిజీగా ఉంటుండగా, మరికొందరు ఇంటర్నెట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తాజాగా హీరోయిన్ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ప్రశ్న అడుగుతూ.. మీరు షారుఖ్ ఖాన్ గురించి ఏమనుకుంటున్నారు? అని అడగగా పూజా దానికి సమాధానం ఇస్తూ... షారూక్ కింగ్ అఫ్ రొమాన్స్ అని తెలిపింది. మరో ప్రశ్నకు సమాదానంగా తన అభిమాన గాయకుడు ఎ ఆర్ రెహమాన్ అని తెలిపింది.