కరోనా దెబ్బకు ఇండియా వ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. మార్కెట్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, జిమ్లు బంద్ అయ్యాయి. వ్యాపారాలు, సంస్థలను మూసేశారు. అయితే, షూటింగ్స్తో బిజీగా ఉండే నటీనటులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలన్న ఆత్రుత చాలా మంది అభిమానులకు ఉంటుంది. అందుకే.. సోషల్ మీడియా ద్వారా తామేం చేస్తున్నామో చెబుతున్నారు సెలబ్రిటీలు. కాగా, కుర్రాళ్ల కలల రాకుమారి సన్నీ లియోన్ కూడా తానేం చేస్తున్నానో షేర్ చేసింది. అదీ కాకుండా ఎండాకాలం కావడంతో ఈ ఎండల్ని తట్టుకొనేందుకు ఏం చేస్తున్నానో వివరించింది. ఇంట్లో వ్యాయామాలు చేస్తున్నానని, లాక్ డౌన్ పరిస్థితుల మధ్య ఫిట్గా ఉండాలని చెప్పింది.
జంక్ ఫుడ్స్ తక్కువగా తినాలని.. ఆరోగ్యకరమైన చిరుతిండికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మిమ్మల్ని మీరు హైడ్రేట్గా ఉంచుకోవాలని వివరించింది. రోజంతా చిన్నచిన్న వర్కౌట్స్ చేయాలని, ఇంటి పనులపైనా ఓ లుక్ వేయాలని సూచించింది. అంతేకాదు.. స్విమ్ సూట్ ధరించిన సన్నీ.. స్విమ్మింగ్ ఫూల్లో సేద తీరుతున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలో సన్నీ ఈజ్ బ్యాక్ అన్నట్లు ఫోజిచ్చింది. ఆ ఫొటో చూసిన కుర్రాళ్లు సంబరపడిపోతున్నారు.